
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలిచ్చారు. అక్రమార్కుల నుంచి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాలు, పార్కుల ప్రదేశాల్లో ‘హైడ్రా’ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 2024 జులై తర్వాత అనుమతి లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అమీన్పూర్ చెరువు, దుర్గం చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువు, మాసబ్ చెరువులను తక్షణమే పరిశీలించాలని పేర్కొన్నారు.