మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..!

152594చూసినవారు
మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..!
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వెళ్లే భక్తులకు హెలీకాప్టర్ లో ప్రయాణం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత భక్తులు తిరుగుపయనం చేస్తారు. భక్తుల కోసం ప్రత్యేకంగా హెలీకాప్టర్ జాయ్ రైడ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జాతర పరిసరాలను విహంగ వీక్షణంతో ఆస్వాదించే అవకాశాన్ని కల్పించనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు అందుబాటులో ఉంచనున్నారు.

సంబంధిత పోస్ట్