BJPలో కార్యకర్తలకే పెద్దపీట: కిషన్‌రెడ్డి

78చూసినవారు
BJPలో కార్యకర్తలకే పెద్దపీట: కిషన్‌రెడ్డి
BJP ఎల్లప్పుడూ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న తరుణంలో దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘సంకల్పపత్రంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే అయిదేళ్లు అంకితభావంతో పని చేస్తాం. రాష్ట్రంలో గత పదేళ్లలో కేందం రూ.10 లక్షల కోట్లను ఖర్చు చేసింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరో 3 కోట్ల ఇళ్లను పేదల కోసం నిర్మిస్తాం’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్