దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు పెరిగిపోతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 36,075 మోసాలు నమోదు అయ్యాయి. 2021-22లో 9,046, 2022-23లో నమోదైన 13,564 మోసాలతో పోలిస్తే ఈ సంఖ్య అధికం. అయితే, ఈ మోసాల్లో పొగోట్టుకున్న సొమ్ము మాత్రం గణనీయంగా తగ్గింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే క్రితం ఏడాది రూ.26,127 కోట్ల నుంచి రూ.13,930 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ తెలిపింది.