ఇండియా కూటమి రాత్రి పగలు మోదీని దుర్భాషలాడడంలో బిజీగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘2024 ఎన్నికల్లో ఒకవైపు 24 గంటలు కష్టపడుతున్న మోదీ, మరోవైపు అబద్ధాలు చెప్పే ఇండియా కూటమి ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చడంలో మోదీ బిజీగా ఉన్నారు. కానీ మోదీని దుర్భాషలాడంలో ఇండియా కూటమి నేతలు బిజీగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.