పాక్ డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు

1054చూసినవారు
పాక్ డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు
జమ్మూ కాశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లను నేలకూల్చేందుకు ఆర్మీ దళాలు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. బాల్నోయ్-మెంధార్, గుల్పూర్ సెక్టార్‌లలోని భారత భూభాగంపై కొద్దిసేపు పాక్ కు చెందిన డ్రోన్లు ఎగిరిన తర్వాత దాయాది దేశంలోకి తిరిగి వెళ్లిపోయినట్లు అధికారులు చెప్పారు. పాక్ డ్రోన్‌ల గురించి సమాచారం అందించిన వారికి 3 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్