దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు కలకలం రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఐఐటీ ఢిల్లీలో ఓ విద్యార్థి మృతిచెందాడు. మహారాష్ట్రలోని నాశిక్కు చెందిన నెర్కర్ (24) అనే విద్యార్థి ఎంటెక్ చదువుతున్నాడు. క్యాంపస్లోని ద్రోణాచార్య వసతిగృహంలో అతడి మృతదేహం శుక్రవారం వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.