ఐసీసీ ర్యాంకుల్లో భారత యువ క్రికెటర్లు అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ అదరగొట్టారు. టీ20 ఫార్మాట్లో తాజాగా ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. అక్షర్ పటేల్ (660 పాయింట్లు) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్కు చేరాడు. అర్ష్దీప్ సింగ్ మూడు స్థానాలు పైకి ఎగబాకి 16వ ర్యాంకును అందుకొన్నాడు. ఈ జాబితాలో రవి బిష్ణోయ్ (659) ఐదో స్థానంలో ఉన్నాడు.