బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,300 పెరిగి రూ.63,000కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,420 పెరిగి రూ.68,730 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.300 పెరగడంతో రూ.80,800కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.