ఇరాన్ సీజ్ చేసిన ఇజ్రాయెల్ షిప్లో భారతీయులను కేంద్ర ప్రభుత్వం కాపాడాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆదివారం కోరారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని ఆయన లేఖ రాశారు. షిప్లో భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావాలన్నారు. హెర్ముజ్ జలసంధిలో ఇజ్రాయెల్ షిప్ను ఇరాన్ సీజ్ చేసింది. అందులో 17 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ముగ్గురు కేరళకు చెందిన వారు.