తెలంగాణలో నేడు మరో రెండు పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనుంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్ లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు పథకాలను ప్రారంభించనున్నారు. ఇక సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ జరగనుంది.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.