AP: మంత్రి కందుల దుర్గేష్ బుధవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో గత ఏడాది జులైలో తూ.గోదావరి జిల్లాలో ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన రైతులకు మంత్రి శుభవార్త చెప్పారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేస్తామని వెల్లడించారు. కలెక్టర్ల సదస్సులో నిధులు విడుదల చేయాలని సీఎం ను ఆదేశించారని పేర్కొన్నారు. కాగా భారీ వర్షాలు వల్ల గోదావరి జిల్లాల్లో 20 నియోజకవర్గాల్లో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.