నాగ్పూర్లో జరిగిన
బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో
బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాహుల్ గాంధీపై విమర్శలు కురిపించారు. ‘ రాహుల్ గాంధీ బీజేపీకి దేవుడు ఇచ్చిన వరం. ప్రతిపక్ష నేత ఇలాగే ఉంటే మనం అదృష్టవంతులుగా భావించాలి’ అని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నేత ఉండటం బీజేపీకి కలిసొస్తుందని అన్నారు. ఆ పార్టీలో కార్యకర్తల గురించి పట్టించుకోరని విమర్శించారు.