ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై ఆసక్తి నెలకొంది. రేపటితో సీబీఐ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. దీంతో ధర్మాసనం బెయిల్ ఇస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. తాజాగా కేజ్రీవాల్కు బెయిల్ లభించడంతో కవితకు కూడా వస్తుందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.