IPL ఫైనల్: పీకల్లోతూ కష్టాల్లో సన్రైజర్స్
By dwarak 53చూసినవారుఐపీఎల్-2024 ఫైనల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతూ కష్టాల్లో మునిగింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన టాపార్డర్ చేతులేత్తేసింది. అభిషేక్ శర్మ (2), హెడ్ (0), రాహుల్ త్రిపాఠి (9), షాబాజ్ (5) పూర్తిగా నిరాశపరిచారు. 11 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. మార్క్రమ్ (20), నితీశ్రెడ్డి (13) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం క్లాసెన్ (13*), కమిన్స్ (9*) క్రీజులో కొనసాగుతున్నారు.