IPL-2025లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా 16వ మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ను ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ‘ఢీ’ కొట్టనుంది. ఈ IPLలో చెరో 3 మ్యాచ్లాడిన ఇరు జట్లు ఒక్కో విజయం సాధించి రెండేసి పరాజయాలు మూటగట్టుకున్నాయి. LSG కెప్టెన్ పంత్, MI ఓపెనర్ రోహిత్ శర్మ అంతగా రాణించక పోవడం తో ఈ మ్యాచ్ లో అందరీ ఫోకస్ వాళ్లపైనే ఉండనుంది. వీరిద్దరు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగుతారో చూడాలి.