ఆక్రమిత వెస్ట్బ్యాంక్లోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ దళాలు విరుచుకుపడ్డాయి. శనివారం జరిపిన దాడిలో 14 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇజ్రాయిల్ దళాల దాడిలో గాయపడిన పాలస్తీనియన్లను తరలించేందుకు వెళ్లిన ఓ అంబులెన్స్ డ్రైవర్ కూడా మరణించినట్లు పేర్కొన్నారు.