భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ‘ఆదిత్య ఎల్1’ ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధరణ అయినట్లు తెలిపారు. ఓ మలయాళం వెబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు.