ఇలా జరగడం బాధాకరం: పవన్‌

18908చూసినవారు
రామోజీరావు మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రామోజీ తట్టుకుని నిలబడి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారని పేర్కొన్నారు. తెలుగు మీడియాలో పనిచేస్తున్న వేలాది జర్నలిస్ట్‌లు ఈనాడు జర్నలిజం స్కూల్‌ నుంచి వచ్చినవారేనని తెలిపారు. ఫిల్మ్‌సిటీ నిర్మించడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఎంతో సేవ చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఈనాడు ఉద్యోగులకు సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్