‘మహా కుంభమేళా కంటే లండన్ వెళ్లడమే చీప్’

51చూసినవారు
‘మహా కుంభమేళా కంటే లండన్ వెళ్లడమే చీప్’
మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. బుధవారం మౌని అమావాస్య కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇదే అదనుగా ఫ్లైట్ ట్రావెల్ ఏజెన్సీలు టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. సాధారణ సమయాల్లో ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ ఫ్లైట్ టికెట్ రూ.5 వేలు ఉండగా ప్రస్తుతం దానిని రూ.32వేలుగా నిర్ణయించాయి. దీంతో 'ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌ కంటే లండన్‌‌కు‌ (రూ.24 వేలు) వెళ్లడం చీప్‌ అని ఓ ప్రయాణికుడు ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు.

సంబంధిత పోస్ట్