జగన్‌ అసెంబ్లీకి రావాలి: మంత్రి పయ్యావుల కేశవ్‌

75చూసినవారు
జగన్‌ అసెంబ్లీకి రావాలి: మంత్రి పయ్యావుల కేశవ్‌
AP: వైసీపీ అధినేత జగన్ శాసనసభకు రావాలని కోరుకుంటున్నామని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో సంబంధిత దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్‌ అసెంబ్లీకి రావాలన్నారు. జగన్ సభకు వచ్చి సమస్యలపై మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్