ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. పేరు పిలిచిన వెంటనే సభలోకి వచ్చారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లోకి వెళ్లి కొద్దిసేపు వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేరుగా తాడేపల్లి ప్యాలస్కు వెళ్లిపోయారు. అసెంబ్లీ లోపలకి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయం ఉండటంతో 5 నిమిషాల పాటు చివరి బెంచ్లో కూర్చున్నారు. ఆయనతో పాటు పక్కనే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కూర్చొన్నారు.