అసెంబ్లీలో వెనుక బెంచ్‌లో కూర్చొన్న జగన్

74చూసినవారు
అసెంబ్లీలో వెనుక బెంచ్‌లో కూర్చొన్న జగన్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. పేరు పిలిచిన వెంటనే సభలోకి వచ్చారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్‌లోకి వెళ్లి కొద్దిసేపు వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేరుగా తాడేపల్లి ప్యాలస్‌కు వెళ్లిపోయారు. అసెంబ్లీ లోపలకి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయం ఉండటంతో 5 నిమిషాల పాటు చివరి బెంచ్‌లో కూర్చున్నారు. ఆయనతో పాటు పక్కనే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కూర్చొన్నారు.

సంబంధిత పోస్ట్