నవదుర్గ పీఠ క్షేత్రంలో స్కంద రూపంలో అమ్మవారు

67చూసినవారు
నవదుర్గ పీఠ క్షేత్రంలో స్కంద రూపంలో అమ్మవారు
జగిత్యాల పట్టణంలోని గోవిందు పల్లె లోగల నవదుర్గ పీఠంలో దేవినవరాత్రులలో భాగంగా ఐదవరోజున అమ్మవారు భక్తులకు స్కంద రూపంలో దర్శనం ఇచ్చారు. నవదుర్గ సమితి ఆధ్వర్యంలో మహిళాలకు కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించగా అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం అన్నదాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవదుర్గ సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్