ఎంబీబీఎస్ లో సీటు సాధించిన మ్యాదరి రేణుక

53చూసినవారు
ఎంబీబీఎస్ లో సీటు సాధించిన మ్యాదరి రేణుక
జగిత్యాల మండలం ధరూర్ గ్రామానికి చెందిన మ్యాదరి శ్రీనివాస్, వరలక్ష్మి దంపతుల కూతురు మ్యాదరి రేణుక కరీంనగర్ లోని ప్రతిమ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ధరూర్ గ్రామానికి చెందిన మ్యాదరి రేణుక చిన్ననాటి నుండి విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచేది. ఈ సందర్బంగా రేణుక మాట్లాడుతూ నిరుపేదలకు వైద్యం అందించడమే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. రేణుకను గురువారం పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్