జాన్వీ కపూర్ తన తాజా చిత్రం 'మిస్టర్ అండ్ మిస్సెస్ మహి' కోసం 150 రోజుల పాటు క్రికెట్ శిక్షణ తీసుకుంది. క్రికెట్ సాధనలో భాగంగా రెండు సార్లు గాయపడింది. క్రికెటర్ పాత్రలో సహజంగా నటించడానికి ఆమె ఎంతో కష్టపడ్డారు. ప్రతీ సీన్ సహజంగా ఉండాలని పూర్తి క్రికెటర్గా మారింది. ఈ చిత్రంలో రాజ్కుమార్ రావ్, జాన్వీ జంటగా నటిస్తున్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది.