మూడు బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ

55చూసినవారు
మూడు బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ
మణిపూర్ లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో గల నోంగ్‌డామ్, ఇథమ్ గ్రామాలను కలిపే రహదారిపై అమర్చిన ఐఈడీలను ఆర్మీ జవాన్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ రోడ్డును మూసివేశారు. బాంబు స్క్వాడ్ ను అక్కడకు రప్పించి, మూడు బాంబులను నిర్వీర్యం చేశారు. దీంతో ప్రాణ నష్టం జరుగకుండా, స్థానికులకు గాయాలు కాకుండా నిరోధించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. రొటీన్‌ తనిఖీల సందర్భంగా వీటిని గుర్తించినట్లు ఆర్మీ అధికారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్