జేజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

74చూసినవారు
జేజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
హర్యానాలో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేతను దుండగులు కాల్చి చంపేశారు. పానిపట్‌లోని వికాస్ నగర్‌లో జేజేపీ నేత రవీందర్‌ మిన్నాపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రవీందర్ మరణించారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబగొడవల నేపథ్యంలో దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్