హైదరాబాద్లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా బయటపడింది. మార్చి 23న జరగనున్న హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్ టికెట్లను ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద భరద్వాజ్ అనే వ్యక్తి బ్లాక్లో విక్రయిస్తూ ఎస్ఓటీ అధికారులకు పట్టుబడ్డాడు. ఎస్ఓటీ అధికారులు అతడిని అరెస్ట్ చేసి, టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత భరద్వాజ్తో పాటు టికెట్లను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.