దేశంలో 511కు చేరిన జేఎన్‌.1 కేసులు

56చూసినవారు
దేశంలో 511కు చేరిన జేఎన్‌.1 కేసులు
కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా జేఎన్‌.1 కేసులు 511కు చేరుకున్నాయి. అత్యధికంగా కర్ణాటకలో 199 మంది దీని బారిన పడ్డారని అధికారులు బుధవారం వెల్లడించారు. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ 148, గోవా 47, గుజరాత్‌ 36, మహారాష్ట్ర 32, తమిళనాడు 26, దిల్లీ 15, రాజస్థాన్‌ 4, తెలంగాణ 2, ఒడిశా, హరియాణాలలో ఒక్కో కేసు నమోదైందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్