సాధ్యమైనంత త్వరలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు, నిరుద్యోగ యువత గురువారం ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. విద్యార్థుల ధర్నాపై మంత్రి స్పందిస్తూ, త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. జీవో 46 బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.