ప్రమాదంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు: ఉత్తమ్

65చూసినవారు
ప్రమాదంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు: ఉత్తమ్
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 'ఎన్నికల కోడ్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ వీలు కాలేదు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం పనుల పురోగతిని పరిశీలించా. 94 వేల కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కట్టారు.. మేము వడ్డీలు కడుతున్నాం. గత ప్రభుత్వ హయంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. మూడు బ్యారేజీల గేట్లు ఎత్తాలని నిపుణుల కమిటీ చెప్పింది. మరమ్మత్తులు చేసినా.. నీళ్లు స్టోర్ చేయొద్దని హెచ్చరించింది' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్