కమ్మర్ పల్లి మండలంలోని గాంధీనగర్కు చెందిన లక్ష్మి అనే వివాహిత (28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం.. అల్లెపు ప్రసాద్, లక్ష్మి దంపతులు గాంధీనగర్ లో నివాసం ఉంటారు. బతుకుదెరువు కోసం ప్రసాద్ గల్ఫ్ దేశానికి వెళ్లాడు. వారి మధ్య తరచూ ఫోన్లోనే గొడవలు జరుగుతున్నాయి. దీంతో గొడవలకు మనస్థాపం చెంది ఇంట్లోనే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.