బీసీ హాస్టళ్లలో కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు

73చూసినవారు
బీసీ హాస్టళ్లలో కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు ఎందుకు చేస్తున్నారని విద్యార్థులకు ఏమైనా అయితే బాధ్యులు ఎవరని జెడ్పీ సీఈవో చందర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ పట్టణంలోని బాలుర, బాలికల బీసీ హాస్టళ్లను గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతిపై ఆరా తీశారు. వంటగదిలో కుళ్లిపోయిన కూరగాయలను చూసి వార్డెన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్