కుళ్లిన కూరగాయలతో వంటలు: జెడ్పీ సీఈవో ఆగ్రహం

68చూసినవారు
కుళ్లిన కూరగాయలతో వంటలు: జెడ్పీ సీఈవో ఆగ్రహం
బాన్సువాడ పట్టణంలోని బాలుర, బాలికల బీసీ హాస్టళ్లను గురువారం జెడ్పీ సీఈవో చందర్ నాయక్ తనిఖీ చేశారు. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు ఎందుకు చేస్తున్నారని విద్యార్థులకు ఏమైనా అయితే బాధ్యులు ఎవరని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతిపై ఆరా తీశారు. వంటగదిలో కుళ్లిపోయిన కూరగాయలను చూసి వార్డెన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్