బోర్లo పాఠశాలలో ఎస్జిటి టీచర్ల నిరసన

62చూసినవారు
బోర్లo పాఠశాలలో ఎస్జిటి టీచర్ల నిరసన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లo ప్రాథమిక పాఠశాలలో గురువారం ఎస్జిటి ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్జిటి టీచర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు గోపి ఉపాధ్యాయులు అయ్యల సంతోష్, చైతన్య , సాయిలు, రమేష్, సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్