నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ ఎంపీటీసీ సుజాత రమేష్ కుమార్ ఆదివారం బిఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో మండల స్థాయి నాయకుల వైఖరిలో మార్పు రానందున, ఎంపీటీసీలకు కనీసం గౌరవం ఇవ్వలేదని గుర్తింపు లేని చోట ఉండకపోవడం మంచిదని పార్టీ రాజీనామా చేస్తున్నట్లు వారి తెలిపారు.