తిమ్మానగర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

60చూసినవారు
తిమ్మానగర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మలను తయారు చేశారు. సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ విద్యార్థినిలు అడి పాడారు. అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గిరిజ, నవనీత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్