జోరుగా టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ

401చూసినవారు
జోరుగా టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే ఆదేశాల ప్రకారం టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను నిర్వహిస్తుంది. సంస్థ గత ఎన్నికల్లో భాగంగా పడంపల్లి గ్రామంలో పార్టీ అధ్యక్షులుగా పావుడే మల్లికార్జున్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

అంతే కాకుండా నూతన కమిటీలను కమిటీల అధ్యక్షులను సభ్యులను పాలక వర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. తనపై ఎంతో నమ్మకం ఉంచి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకు న్నందుకు నూతనధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు సాయ గౌడ్, ఎంపీపీ యశోద నీలు పాటిల్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బొల్లి గంగాధర్, సహకార సంఘం అధ్యక్షులు శివానంద్, మాజీ జెడ్పిటిసి మాధవరావు దేశాయ్, రాజు పటేల్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్