పార్టీ కోసం కష్టపడే పనిచేసి కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే గౌరవం ఇవ్వాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. గురువారం జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిచ్కుంద, జుక్కల్ మద్నూర్ మండల నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.