నేడు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 18వ వార్షికోత్సవం

74చూసినవారు
నేడు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 18వ వార్షికోత్సవం
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్), కుర్తి గేటు వద్ద గల శ్రీ శిరిడి సాయి ద్వారక మయి ఆశ్రమం 18వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఉదయం అభిషేకం, మధ్యాహ్న హారతి, ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహిస్తున్నాము కావున చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్