
విషాదం.. పిడుగుపాటుకు ఐదుగురు మృతి
AP: రాష్ట్రంలో పిడుగుపాటుకు ఒకేరోజు ఐదుగురు చనిపోయారు. ప్రకాశం జిల్లా పెద్ద ఓబినేనిపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన సన్నీ (17), ఆకాశ్ (18) క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడటంతో మృతి చెందారు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురానికి చెందిన ఈరన్న (28) ఆలయానికి వెళ్లినప్పుడు పిడుగుపడటంతో చనిపోయారు. చిప్పగిరిలో పిడుగు పడి కొమ్మ విరగడంతో శివన్న (65) మరణించారు. జమ్మలమడుగుకు చెందిన ఓబులేశు (22) పొలంలో పని చేస్తుండగా పిడుగు పడింది.