ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ పంపిణీ

51చూసినవారు
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ పంపిణీ
దోమకొండ మండల కేంద్రంలో ఉపాధి కూలీలకు గురువారం ఎండ తీవ్రతను తట్టుకునేందుకు గాను దోమకొండ సబ్ సెంటర్ పరిధిలోని సిబ్బంది 133 మంది ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ పంపిణీ చేసినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ రాజలింగం తెలిపారు. ఎండ తీవ్రత రోజురోజుకు పెరగడంతో కూలీలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రభావతి, సంజీవని, సుధారాణి, బాలమణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్