బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

71చూసినవారు
కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకులను పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కేటీఆర్ పిలుపు మేరకు ప్రజా భవన్ ముట్టడికి బయలుదేరిన పట్టణ బిఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, గరిగంటి లక్ష్మీనారాయణ, భూమి రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్