వెల్లుట్లలో పెద్దమ్మ తల్లికి ఘనంగా బోనాలు

83చూసినవారు
వెల్లుట్లలో పెద్దమ్మ తల్లికి ఘనంగా బోనాలు
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లలో మంగళవారం ముదిరాజులు పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేసి, ఘనంగా బోనాలు నిర్వహించినట్లు గ్రామ మాజీ సర్పంచ్ గంట రాజేశ్వరి సాయిలు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ముదిరాజుల బంధువులు, ఆడపడుచులతో సందడి నెలకొంది. పంతులు జోషి శ్రీనివాసరావు వేద మంత్రొచ్చారణలతో పెద్దమ్మ తల్లికి భక్తులచే పూజలు చేయించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్