రైతులు సంతోషంగా ఉంటే యావత్ దేశం సుభిక్షమే: ఎమ్యెల్యే

61చూసినవారు
రైతులు సంతోషంగా ఉంటే యావత్ దేశం సుభిక్షంగా ఉంటుందని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ అన్నారు. శనివారం నాగిరెడ్డి పేట్ మండలం మల్తూమ్మద సొసైటీలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్ పర్సన్ రజితతో కలిసి ప్రారంభించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్