జుక్కల్ సెగ్మెంట్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సమక్షంలో పిట్లం మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి కుమ్మరి రాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణరెడ్డి, గులాని సాయిలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్యెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కాసుల బాలరాజ్, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.