ఎల్లారెడ్డిలో ఘనంగా నాగుల పంచమి

80చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ ముత్యాల పోచమ్మ ఆలయం శుక్రవారం నాగుల పంచమి సందర్బంగా మహిళ భక్తులతో కిటకిటలాడింది. నాగుల పంచమి పండుగ సందర్భంగా ఉదయం నుండి భక్తుల తాకిడి పెరిగింది. మహిళ భక్తులందరూ మొదట అమ్మవారిని దర్శించుకుని అటు తరువాత ఆలయం పక్కనే ఉన్న పెద్డ పుట్టలో పాలు పోసి జొన్న ప్యాలాలు సమర్పించి మొక్కులు మొక్కుకున్నారు. ఎప్పటిలాగానే ఆలయ కమిటీ భక్తులకు సౌకర్యాలు కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్