కలెక్టరేట్ లో వినతి పత్రం సమర్పించిన జొన్న రైతులు

56చూసినవారు
కలెక్టరేట్ లో వినతి పత్రం సమర్పించిన జొన్న రైతులు
లింగంపేట మండలం పరమళ్ళ గ్రామానికి చెందిన రైతులు జొన్నలు కొనుగోలు చేయాలని మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో 400 ఎకరాల్లో జొన్న పంటను సాగు చేశామని, ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి తిప్పలు పడుతున్నామని వాపోయారు. ఎల్లారెడ్డి, గాంధారి మార్కెట్ యార్డులకు వెళ్లి అక్కడి సీఈవోలను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్