క్వారీ కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య

63చూసినవారు
క్వారీ కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య
రెమాల్ తుపాను ధాటికి ఇవాళ ఉదయం మిజోరాంలోని ఐజ్వాల్ జిల్లాలో ఒక గ్రానైట్ క్వారీ కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా, మరో 6-7 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 17 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీయగా, మరికొంతమంది రాళ్ల కిందనే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. చనిపోయిన వారిలో నాలుగేళ్ల బాలుడు, ఆరేళ్ల బాలిక ఉన్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్