అక్కపెల్లి దేవస్థానం హుండీల లెక్కింపు

589చూసినవారు
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీలను సోమవారం విప్పి లెక్కించారు. మొత్తం రూ. 2, 22, 400 ఆదాయం సమకూరినట్లు ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. అలాగే మిశ్రమ బంగారం 1. 5 గ్రాములు, మిశ్రమ వెండి 335 గ్రాములు, 4 విదేశి నోట్లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్